విలియం షేక్స్‌పియర్

విలియం షేక్స్‌పియర్ ప్రముఖ ఆంగ్ల రచయిత. ఇతడు బ్రిటన్‌కు చెందినవాడు. ఏప్రిల్ 26, 1564లో జన్మించాడు. ఏప్రిల్ 23, 1616న మరణించాడు. ఇతని ప్రముఖ రచనలు: యాజ్ యు లైక్ ఇట్, ది మర్చంట్ ఆఫ్ వెనైస్, ది టెంపెస్ట్, రోమియో అండ్ జూలియట్, జూలియస్ సీజర్, హామ్లెట్, ఆంటోనీ అండ్ క్లియోపాత్ర.

విలియం షేక్స్‌పియర్

విలియం షేక్స్‌పియర్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు మార్చు

  • కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు.[1]
  • ప్రపంచమే ఒక నాటకరంగం, ప్రజలందరూ అందులో పాత్రధారులే.
  • ఉంటే ఉండు లేకుంటే వెళ్ళు.
  • నేను వచ్చాను, చూశాను, సాధించాను.[2]
  • పిరికివాళ్ళు చావడానికి ముందు అనేకసార్లు చస్తుంటారు.[3]
  • మూర్ఖుడైన మిత్రుడు వివేకవంతుడైన శతృవుకంటె ప్రమాదం.
  • ఇతరుల సలహాపై ఆధారపడకు, నీ ఆలోచనలను నువ్వు అనుసరించు.
  • బాలలు తల్లిదండ్రుల సంపద.
  • అందరినీ ప్రేమించు, కొందరినే నమ్ము, ఎవరికీ హాని తలపెట్టకు.
  • డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ, డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టు కోవడం మాత్రం మంచిది కాదు.
  • పిరికివాళ్ళు చావుకి ముందు ఎన్నోసార్లు చస్తూ బ్రతుకుతుంటారు,
  • కానీ ధైర్యసాహసాలు గలవాళ్ళు జీవితంలో ఒకే ఒక్కసారి చస్తారు.
  • ఒక సారి నీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారిని ఇంకెన్నడూ నమ్మకు.
  • ప్రపంచంలో మంచి మాటలు ఎంతో కొరతతో కూడినవి అందుచే వ్యర్ధంగా పాడు చెయ్యవద్దు.
  • వివేక శూన్యుడైన మిత్రుడు , వివేకవంతుడైన శత్రువు కంటే ప్రమాదం.
  • మంచి చెడు అనేది ఏమి లేదు, ఆలోచనే అలా చేస్తుంది.
  • పుకారు అనేది ఊహలు,భావనలు,అసూయ కలిపి ఉదాబడే పిల్లనగ్రోవి.
  • సద్గుణాన్ని మించిన సౌందర్యం లేదు.
  • దొంగవాడు ధనవంతుని దోచుకొని జీవనం సాగిస్తున్నాడు.
  • మంచి కాలం పుడుతుందనే నమ్మకం తప్ప బలహీనులకు వేరే మందు లేదు.
  • మనస్సులో తప్పు చేశామన్న భావన వున్నవారు ప్రతి కళ్లు తమను చూస్తూన్నాయని తలుస్తారు.
  • రాజకీయ నాయకులు భగవంతుణ్ణే ఎదురించే తెలివి గలవారు.
  • మనసు తప్ప కొరత ఉన్నది ప్రకృతిలో వేరే లేదు. ప్రేమ లేనివారే అంగ విహీనులు.
  • నిజమైన నమ్మకం వివేకవంతమైనది. పక్షి కంటే అది వేగంగా ఎగురుతుంది. రాజులను అది దేవతలను చేస్తుంది. సామాన్యులను అది రాజులను చేస్తుంది.
  • ఎప్పుడు మనం అదృష్టం అనే దేవతను అధికముగా కోరుకుంటున్నమో అప్పుడు ఆ దేవత మనను ఎక్కువగా దభాయించి చూస్తుంది.
  • చట్టం యొక్క ముఖ్యమైన లక్షణం జాలి. జాలి లేని దుర్మార్గులు దానిని ఘోరమైన ఆయుధముగా ఉపయోగిస్తున్నారు.
  • సంగీతానికి ఒక మైమరపించే శక్తి కలదు. చెడుని మంచి దానిగా చేస్తుంది. మంచి దానిని చెడుగా మారుస్తుంది.
  • తప్పు చేసిన మనసును అనుమానం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.
  • ఊహలు, భావనలు, అసూయ కలగలిసిన శ్రావ్యగీతాలే వదంతులు.
  • తక్కువ కళతో ఎక్కువ విషయాన్ని చెప్పాలి.
  • ఒక పని వంద మాటలతో సమానం.[4]

మూలాలు మార్చు

  1. Twelfth Night రచన లోని వ్యాఖ్య
  2. జూలియస్ సీజర్ నాటకంలో విలియం షేక్స్పియర్
  3. జూలియస్ సీజర్ నాటకంలో విలియం షేక్స్పియర్
  4. http://teluguquotations.blogspot.in/