]] కిన్నెరసాని ఖమ్మం జిల్లాలోని కొండకోనల్లో ప్రారంభమై రమ్యమైన అటవీమార్గం గుండా కనువిందుచేసే ప్రయాణం చేసి గోదావరిలో విలీనమయ్యే వాగు. విశ్వనాథ సత్యనారాయణ ఆ నదిని తెలుగు ఇల్లాలిగా కల్పనచేసి కిన్నెరసాని పాటలు అనే గేయకావ్యాన్ని రచించారు. అప్పటినుంచి కిన్నెరసాని తెలుగు కవుల ఊహా సుందరి. పలు కవితలలో, పాటలలో ఈమె ప్రస్తావన ఉంది.

 గోదావరమ్మయా?
కాదు, కృష్ణమ్మయా?
కాదు,పెన్నమ్మయా?
కాదు,తుంగమయా?

వాదులాటలు రాని
సాదు కిన్నెర యామె
జాలు కన్నియ యామె

---సినారె[1]

వ్యాఖ్యలు మార్చు

  • కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
- వేటూరి ( సితార చిత్రం నుండి )
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. సినారె:దివ్వెల మువ్వలు(కిన్నెరసాని),కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1962,పుట-35