కీర్తి సురేష్

సినీ నటి

కీర్తీ సురేష్ భారతీయ నటి. మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించారు. నిర్మాత జి. సురేష్ కుమార్‌, నటి మేనకల కుమార్తె కీర్తి. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేశారు ఆమె. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు తిరిగి వచ్చిన తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు. 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు ఆమె. ఆ తరువాత తమిళ, తెలుగు చిత్రాలు కూడ నటించేందుకు సిద్ధమయ్యారు.[1]

2017లో కీర్తి సురేష్

వ్యాఖ్యలు మార్చు

  • నేను ఏ పెద్ద సినిమాలో నటించినా అంతిమంగా నా వ్యక్తిత్వమే ముఖ్యం. నేను దానిని కొనసాగించేలా చూసుకుంటాను.
  • ఏదో ఒక రోజు నేను పెళ్లి చేసుకుంటాను, నా పిల్లలు, అత్త, మామలతో కలిసి నా సినిమాలు చూడగలను.
  • నా గత చిత్రం కంటే బాగా చేశానా లేదా అనే దాని గురించి నేను ఆందోళన చెందుతాను.[2]
  • కేవలం పాటలు పాడుతూ, డ్యాన్స్ చేసి వెళ్లిపోయే సినిమాల్లో భాగం కావాలనుకోవడం లేదు.
  • నేను చాలా డ్రీమర్ ని, సాధారణంగా ఎవరైనా కథ చెప్పినప్పుడు, నేను సులభంగా దృష్టి మరల్చబడతాను.
  • నాకు మంచి పాత్రలు ఆఫర్ వస్తే తప్పకుండా మలయాళంలో మళ్లీ నటిస్తాను.
  • నా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకోవడానికి నాకు సమయం లేదు, కానీ నేను సలహాలు, స్టైల్ చిట్కాలను ఇస్తాను.
  • 'ఒప్పోల్'లో మా అమ్మ చేసిన పాత్రలు, 'క్వీన్'లో కంగనా రనౌత్ పోషించిన పాత్రలు చేయడానికి ఇష్టపడతాను.
  • తమిళ పరిశ్రమ నాకు అద్భుతమైన పాత్రలను ఆఫర్ చేస్తోంది, అదే నన్ను ఇక్కడ ఉంచింది.
  • మంచి పాత్రలు, మంచి సినిమాలను ఎంచుకోవాలనే ఆలోచన ఉంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం నటించడం ఇష్టం లేదు, గ్లామర్ రోల్స్ చేయడానికి రాలేదు.

మూలాలు మార్చు

 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.